తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తర్వాత ‘రాజకుమారుడు’చిత్రంతో హీరోగా మారారు.  ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మహేష్ బాబు కెరీర్ లో ‘పోకిరి’అద్భుతమైన విజయమే కాదు మాస్ ఇమేజ్ ని కూడా పెంచింది.  ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’చిత్రంతో మరో అద్భుతమైన విజయమే కాదు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు. 

వైవిధ్యభరితమైన కథాంశాలు ఉన్న చిత్రాలు చేయడమే కాదు.. అటు అభిమానులను సంపాదించుకోవడంలోనూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుంటాడు.  ఓ వైపు చిత్రాల్లో నటిస్తూనే బుల్లితెరపై  ఎన్నో యాడ్స్ లో నటిస్తున్నాడు. కేవలం సినిమాలే కాకుండా తన ఫ్యామిలీ అప్ డేట్స్ ను కూడా మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా మహేశ్ బాబు మరో ఘనత సాధించాడు.  2010లో మహేశ్ బాబు ఈ అకౌంట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం  ట్విట్టర్ లో ఫాలో అవుతున్నవారి సంఖ్య తాజాగా 70 లక్షలకు చేరుకుంది. తమ హీరోకు ట్విట్టర్ లో భారీగా ఫాలోయింగ్ రావడంపై మహేశ్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాజాగా 70 లక్షల ఫాలోవర్లతో  మహేశ్ హీరోలు ధనుష్, అల్లు అర్జున్ లను దాటేశాడు.  ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’చిత్రంలో నటిస్తున్నారు.  వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: