బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. 150 నుండి 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సాహో సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.


2019 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా నిర్మితమవుతుందట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ చేశారని తెలుస్తుంది.


ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏంటంటే అమూర్ అని అంటున్నారు. ఇదేదో మన భాషలా లేదే అంటే అవును అమూర్ ఓ ఫ్రెంచ్ పదం.. దాని అర్ధం ప్రేమ అని తెలుస్తుంది. యూరప్ బ్యాక్ డ్రాప్ తో జరిగే లవ్ స్టోరీగా ఈ అమూర్ తెరకెక్కనుందట. అందుకే టైటిల్ అది జస్టిఫై అవుతుందని అలా ఫిక్స్ చేశారట.


ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించనుంది. డిజే తర్వాత ఎన్.టి.ఆర్ అరవింద సమేత, మహేష్ మహర్షి సినిమాల్లో ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్దె ప్రభాస్ తో కూడా రొమాన్స్ కు సిద్ధమైంది. మరి ప్రభాస్, పూజాల ఈ అమూర్ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: