నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సవ్యసాచి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చైతూ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ‘ప్రేమమ్’ సినిమా తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వైవిధ్య భరితమైన కాన్సెప్ట్తో.. హై టెక్నికల్ వేల్యూస్తో దర్శకుడు చందు మొండేటి అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని రూపొందించారు. ఈ మూవీ నుండి తొలి లిరికల్ సాంగ్ను మంగళవారం నాడు విడుదల చేశారు.
‘Why Not!!!... మనకిక్కడ చేదైన తీపౌతుందోయ్... Why Not!!!... మనఇద్దరి బాధైనా హాయ్అవుతూందోయ్...’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్కు ఎం ఎం కీరవాణి సంగీతం అద్భుతంగా అందించారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. పీవీఎన్ఎస్ రోహిత్, మనీషా ఈ పాటను పాడారు. ఇక సవ్యసాచి అంటే రెండు చేతులని సమర్ధవంతంగా, శక్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ సినిమాలో చైతూ తన రెండు చేతులని సమర్ధవంతంగా వాడి పరిస్థితులని, ప్రత్యర్ధులని ఎదుర్కొంటాడు అని చూపించనున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాలో మాధవన్, భూమికలు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 2న సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంతో హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. మాధవన్, భూమికలు కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.