తెలుగు ఇండస్ట్రీలోకి బాల నటిగా ప్రవేశించి పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా మారి అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పాటు రెండు తరానికి చెందిన నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలతో నటించి మెప్పించిన హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి.  బాహుబాషా నటిగా ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించిన శ్రీదేవి తెలుగు లో మంచి పొజీషన్లో ఉన్న సమయంలో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కూడా నెంబర్ వన్ పోజీషన్లోకి వచ్చిన తర్వాత ప్రముఖ నిర్మాత బోనికపూర్ ని వివాహం చేసుకుంది.  వీరికి జాన్వి, ఖుషి కపూర్ లు జన్మించారు.  అయితే దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడే అనుకోని ప్రమాదానికి గురై..మరణించారు. 

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవికి వరుసగా మంచి చాన్సులు వస్తున్న సమయంలో ఆమె మరణం సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచింది.  ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఇక తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్.  ఈ మద్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’అనే పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 9 న అభిమానుల ముందుకు రాబోతుందని..దర్శకులు క్రిష్ తెలిపారు. 

ఈ చిత్రం రెండు పార్ట్ లుగా తీస్తున్న విషయం తెలిసిందే.  మొదటి పార్ట్ ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో సాగుతుంది.  ఇప్పటికే ముఖ్యపాత్రల్లో విద్యాబాలన్, ఏఎన్ ఆర్ గా సుమంత్, సీఎం చంద్రబాబు పాత్రలో రానా కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో ఎక్కువగా హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి పాత్ర రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.  నేడు రకూల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ లో బాలయ్య, రకుల్ జోడీ కనిపిస్తుందని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ ఇలా కనిపించనుంది.  నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న రకూల్ ప్రీత్ సింగ్ కి ఏపీహెరాల్డ్.కామ్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: