టీవీ నటి రోమా బాలి భర్త, ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు నితిన్‌ బాలి కన్నుమూశారు. ‘నా జానే’అంటూ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి... ‘నిలె నిలె అంబర్‌ పర్‌’ రీమిక్స్ పాటతో పేరు తెచ్చుకున్నారు.   నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు పాలైన నితిన్‌, ఈ రోజు ఉదయం చనిపోయారు. మాలద్‌ నుంచి బొరివిల్లిలో ఉన్న తన ఇంటికి వెళ్తున్న క్రమంలో, గాయకుడి కారు డివైండర్‌ను ఢీకొట్టింది. వెంటనే ఆయన్ని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమి చికత్స తీసుకొని తిరి ఇంటికి చేరుకున్నారు. 

కానీ ఇంటికి చేరుకున్న తర్వాత ఉన్నట్టుండి..నితిన్‌ రక్తపు వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందని, ఆయన ఇంట్లో కుప్పకూలిపోవడమే ఒక్కసారిగా హార్ట్‌ రేటు పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు.  వెంటనే ఆయనను తిరిగి ఆసుపత్రికి తీసుకు వెళ్లగా.., ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయారు.

గాయకుడి మేనకోడలు ఈ విషయాన్ని ధృవీకరించారు. నితిన్‌ అంత్యక్రియలు రేపు జరిగే అవకాశమున్నాయి. 90వ దశకంలో ఆయన ఎన్నో ప్రైవేట్ ఆల్బామ్స్ పాడారు..వాటిలో ‘నీలే నీలే అంబర్‌ పర్‌’ అనే క్లాసిక్‌ పాటతో ఎక్కువగా ఫేమస్‌ అయ్యింది.  పాట ఆల్‌టైమ్‌ చార్ట్‌బాస్టర్స్‌గా నిలిచింది. ఆరుకు పైగా ఆల్బమ్స్‌ చేశారు. అవన్నీ చార్ట్‌బాస్టర్స్‌గా నిలిచాయి.

‘నా జానే’తో మ్యూజిక్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా..నితిన్‌ బాలి మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయింటేనే చేసేవారు..ఎలాంటి కాంట్ర వర్సీలకు వెళ్లకుండా కెరీర్ కొనసాగించారు. 012లోనే మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు.   నితిన్ బాలీ మృతి బాలీవుడ్ వర్గాలు సంతాపాన్ని ప్రకటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: