తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 ఎంతో ఉత్కంఠంగా సాగిన విషయం తెలిసిందే.   పదిహేడు మంది కంటిస్టెంట్లతో ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.   మొదట్లో బిగ్ బాస్ 2 పై విమర్శలు వచ్చాయి..కానీ రాను రాను టాస్క్ లు..ఎలిమినేషన్ ఇంట్లో గొడవలు ఒకరిపై ఒకరి ఆరోపణలు..గ్రూపులు రక రకాలుగా సీజన్ 2 కంటిన్యూ అయ్యింది.  అయితే రెండో వారం నుంచి ఇంటి సభ్యుల్లో ఒకరైన కౌశల్ తన మనసులో మాట బహిరంగంగా చెప్పడంతో ఒక్కసారే హీరో అయ్యాడు.

అప్పటి నుంచి కౌశల్ పై సింపతీ పెరగడమే కాదు..ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పడింది.   మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 కి  కౌశల్ విజేతగా నిలిచాడు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కౌశల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని చానల్స్ లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా కౌశల్ మాట్లాడుతూ.. "నేను 'బిగ్ బాస్ హౌస్' నుంచి బయటికి వచ్చిన మూడో రోజున పీఎమ్ గారి ఆఫీస్ నుంచి కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది.

అప్పుడు నేను షూటింగులో ఉండటం వలన, మా ఫాదర్ రిసీవ్ చేసుకుని మాట్లాడారు .. వాళ్లకి థ్యాంక్స్ చెప్పారు" అని అన్నారు.  అంతే కాదు తనకు  'డాక్టరేట్ గురించి వస్తోన్న వార్తల్లో నిజమెంత?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అయితే డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనేది నేను చెప్పడం కన్నా .. ఇచ్చేవాళ్ల ద్వారా మీకు తెలిస్తేనే బాగుంటుంది' అని కౌశల్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: