ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన ‘మహానటి’సూపర్ హిట్ అయ్యింది. ఈ పాత్రలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రకు జీవం పోసిందని టాక్ వచ్చింది. ఇప్పుడు మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్నారు. ఈ సినిమాను 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అయితే మొదటి భాగం సినీ నేపథ్యంలో సాగుతుందని..ఇందుకోసం ముఖ్యపాత్రల్లో ఏఎన్ఆర్ గా సుమంత్ ని తీసుకున్నారు. ఇక ఎస్వీఆర్ గా మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ - శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ఉదయం రిలీజ్ చేశారు. కొద్ది సేపటి క్రితం 'ఆకుచాటు పిందె తడిసే' పాట కు సంబంధించిన స్టిల్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో ‘యమగోల’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన జయప్రద పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జయప్రద పాత్ర కోసం తమన్నాను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో జయప్రద పాత్ర ఐదు నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు.
ఈ పాత్రను చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో జయప్రద పాత్ర రాశీ ఖన్నా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి..కానీ దానిపై క్లారిటీ రాలేదు. తాజాగా తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..ఇందుకోసం 3 రోజుల పాటు డేట్లు కేటాయించిందని కూడా అంటున్నారు. ఇక జయసుధ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో చూడాలి.