ఈ మాటలు అంటుంది ఎవరో కాదు..ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ).  అప్పట్లో మాస్ మహరాజా రవితేజ తో ‘పవర్’ చిత్రాన్ని తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’చిత్రానికి దర్శకత్వం వహించాడు..కానీ ఈ చిత్రం మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేసింది. 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రిపాత్రాభినయం తో వచ్చిన ‘జై లవకుశ’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంతో బాబీ స్టామినా ఎంటో మరోసారి నిరూపించుకున్నాడు..ర్మాతగా కల్యాణ్ రామ్‌ను కూడా నిలబెట్టింది.  దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించిన బాబికి పండంటి పాప పుట్టింది.  తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తన కుటుంబం కొంచెం పెద్దదైందని వివరిస్తూ బాబీ ట్వీట్ చేశారు. ‘‘నా వరకూ చాలా సహజమైన రోజు. కానీ ఇప్పుడే అది మరచిపోలేని రోజుగా మారిపోయింది. నాకు పాప పుట్టింది. నా కుటుంబం కాస్త పెద్దదైంది. చాలా సంతోషంగా ఉంది’’ అంటూ బాబీ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, బాబీ ట్విట్ చూసి దర్శకుడు హరీష్ శంకర్ ‘శుభాకాంక్షలు బాబీ. అమ్మవారి నవరాత్రుల్లో అమ్మాయి పుట్టింది’ అని రిప్లై ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: