తెలుగు రాష్ట్రాలో నిన్నటి నుంచి ‘అరవింద సమేత’చిత్రానికి సంబంధించిన టాక్ నడుస్తుంది.  తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’పై భారీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి.  విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జోడీ అదిరిందని అభిమానులు అంటున్నారు.  ఇండస్ట్రీలో టెంపర్ చిత్రం నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు ఎన్టీఆర్.  అటు త్రివిక్రమ్ మూవీస్ కి యూఎస్ఏ లో మంచి క్రేజ్ వుంది.

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ కారణంతోనే ఓవర్సీస్ లో  200లకి పైగా ప్రీమియర్ షోలు వేశారు.  నిన్న రాత్రి 8 గంటల వరకూ 194 లొకేషన్స్ లో వేసిన ప్రీమియర్ షోల వలన $707,698 వసూళ్లు వచ్చాయి. మిగతా లొకేషన్స్ వసూళ్లు కలుపుకుంటే, ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చిత్రంపై అప్పడే పాజిటీవ్ టాక్ వినిపిస్తుంది.  ప్రీమియం షో చూసిన వాళ్లు పరవాలేదు అని కితాబు ఇస్తున్నారు.  దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న విషయం తెలిసిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: