ఒక వైపు బాలకృష్ణ జూనియర్ ల మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది అంటూ వార్తలు వస్తూ ఉంటే మరో వైపు బాలయ్య జూనియర్ ల అభిమానుల మధ్య ఏర్పడిన చిన్న భేదాభిప్రాయాలు ‘అరవింద సమేత’ మూవీ ఫ్లక్సీలు చింపుకునే వరకు వెళ్ళడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ సంఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో 'అరవింద సమేత' సినిమా ప్రదర్శితం అవుతున్న ఒక ధియేటర్ లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  
బాక్సాఫీసు వద్ద రికార్డులు షురూ
రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.  ఈప్రాంతంలో చాలా కాలంగా  జూనియర్ అభిమాన సంఘంమైన నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్ కు బాలకృష్ణ ఫ్యాన్స్‌ మధ్య చిన్నభేదాభిప్రాయాలు ఉన్నట్లు టాక్. ఈ భేదాభిప్రాయల కారణంగా ‘అరవింద సమేత’ మార్నింగ్ షో టికెట్స్ అన్ని నందమూరి కల్చరల్ అసోసియేషన్ వద్ద ఉంచుకుని బాలకృష్ణ ఫాన్స్ కు అందకుండా చేసారని తెలుస్తోంది. 
అరవింద సమేత సూపర్ హిట్
దీనితో అభిమానుల మధ్య  ఆగ్రహాఆవేశాలు పెరిగి పోవడంతో వారి మధ్య కొందరు ప్రవేసించి  ‘అరవింద సమేత’  ప్లెక్సీలు, బ్యానర్లను చించివేసి నిరసనతెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో నందమూరి హీరోల అభిమానుల మధ్య ఉన్న ఈ గ్యాప్ కు రాజకీయ రంగుపులమడం మంచిది కాదు అంటూ ఈ గొడవను సామరస్య పూరితంగా పరిష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. 
ఎందుకు టిక్కెట్లు ఇవ్వొద్దన్నారు?
ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం నుండి టాక్ తో దూసుకుపోతున్న ‘అరవింద సమేత’ లోని కొన్ని సన్నివేశాల్ని వీడియోల రూపంలో పైరసీ చేసి ఇంటర్ నెట్లో వదిలి నట్లు వార్తలు వస్తున్నాయి. హీరో ఎంట్రీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ డాన్స్‌ మూమెంట్స్‌ ఇలా చాలా స్కీన్స్ థియేటర్స్ లో ఉన్న ప్రేక్షకులు స్క్రీన్ షాట్స్ గా మార్చి తమ మొబైల్‌ ఫోన్లుద్వారా తమ సన్నిహితులకు షేర్ చేస్తున్నారు అన్న వార్తలు కలకలం సృట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి పైరసీని అడ్డుకోవాలి అంటే సెల్ ఫోన్స్ థియేటర్స్ లోకి తీసుకు వెళ్ళనీయని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: