కమెడియన్ కమ్ హీరో సునీల్ హీరోగా ఇక కష్టమని భావించి త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించాడు. రిలీజ్ ముందు సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటుగా మొత్తం సినిమాలో సునీల్ ఉంటాడని అన్నారు. కాని థియేటర్ లో చూస్తే సునీల్ ది ఏదో చిన్న రోల్ అన్నట్టు కనిపించింది.  


ఉన్నంతలో అలరించాడు సునీల్. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంద్ఫో లేదో వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు చిత్రయూనిట్. దిల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ ప్రెస్ మీట్ లో సునీల్ తన అసంతృప్తి వ్యక్తపరిచాడు. తన సీన్స్ చాలా ఉన్నా సినిమాలో తక్కువ వాడారు. అయినా సరే తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని అన్నాడు సునీల్.


ఇక కొందరు సినిమాలో తన రోల్ తక్కువైందని అడుగగా బిర్యాని భయ్యా ఇది నన్ను జీడిపప్పులా వాడేశారు అన్నాడట. ఒకవేళ సినిమా ఫ్రూట్ సలాడ్ అయితే నన్ను పండులా వాడేవారు. బిర్యానిలో పండు వాడితే దరిద్రంగా ఉంటుందని అన్నాడు సునీల్. అక్కడ సునీల్ తన సీన్స్ కట్ చేశారన్న బాధతోనే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు అనిపించింది.


ఏది ఏమైనా సునీల్ కూడా ఓ సూపర్ హిట్ సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా ఉన్నాడనిపిస్తుంది. ఈమధ్య హీరోగా వరుస ఫ్లాఉ ఎదుర్కున్న సునీల్ కమెడియన్ గా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు. అరవింద సమేత ఎన్.టి.ఆర్ కు మాత్రమే కాదు సునీల్ కు వెరీ స్పెషల్ మూవీ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: