టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.   ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల తర్వాత ఈ మద్య పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవిందం’సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. దాంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది..ఈ హీరో కోసం దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.  గీతాగోవిందం తర్వాత ఈ నెల 5న ‘నోటా’తో అభిమానుల ముందుకు వచ్చారు.  రాజకీయ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ఆశించినంత విజయం అందుకోలేక పోయింది. 

ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన  టాక్సీవాలా' సినిమా కోసం వాళ్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపున 'డియర్ కామ్రేడ్' చేస్తూనే ఆయన మరో సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేఎస్ రామారావు  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన లాంచ్ చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. 

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను నిర్మించ‌నుంది. "ఓన‌మాలు", "మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు" లాంటి సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండతో ఈయ‌న‌కు ఇదే తొలి కాంబినేష‌న్.   అదే రోజు ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు.. సినిమాకి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు చిత్ర యూనిట్ తెలియ‌జేయ‌నుంది.

కాగా, విజయ్ సరసన రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మూడవ కథానాయికగా 'ఇజాబెల్లీలీట్' ఉందనేది తాజా సమాచారం. బ్రెజీలియన్ మోడల్ అయిన ఈ సుందరి, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ మాంఛి రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: