ఎవడే సుబ్రమణ్యం సినిమాతో పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత హీరోగా పెళ్లిచూపులు చేశాడు. ఆ సినిమా హిట్ అవడంతో అర్జున్ రెడ్డి అంటూ ఓ క్రేజీ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా వచ్చిన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.


గీతా గోవిందం హిట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన నోటా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజైన నోటా సినిమా విజయ్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. కెరియర్ మంచి జోష్ లో ఉన్న ఈ టైంలో విజయ్ నోటా అతన్ని వెనక్కి నెట్టేసేలా చేసిందని చెప్పొచ్చు.


అయితే ఆడియెన్స్ కూడా ఈ హీరోకి ఇలాంటి సినిమాలు పనికిరావని ఫిక్స్ అయ్యారు. అందుకే అతను కూడా ఆడియెన్స్ కోరిక మేరకు రొమనటిక్ ఎంటర్టైనర్ సినిమాలకే తన ఓటు అంటున్నాడు. అందుకే క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ప్రేమ పెళ్లి నేపథ్యంతో సినిమాకు రెడీ అవుతున్నాడట. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు.


విజయ్ ప్రతి సినిమాలో మూతి ముద్దులు.. క్రేజీ లవ్ స్టోరీ ఉంటుంది. అలాంటివి లేకుండా చేసిన నోటా రివర్స్ కొట్టింది కాబట్టి ఇక మీదట తన సినిమాల్లో అవి తప్పకుండా ఉండేలా చూస్తున్నాడట. మొత్తానికి విజయ్ దేవరకొండ మళ్లీ తన పాత పంథా కొనసాగించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న టాక్సీవాలా మీద కూడా విజయ్ అంతగా హోప్స్ పెట్టుకోలేదని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: