యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అరవింద సమేత. త్రివిక్రం ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలాంటి కిక్ ఇస్తుందో దానికి తగినట్టుగానే ఈ సినిమా వచ్చింది. అంచనాలను అందుకున్న ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో ఈ సినిమా కలక్షన్స్ అదరగొడుతున్నాయి.


ఇక ఈ సినిమా విజయాన్ని నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది హీరోయిన్ పూజా హెగ్దె. సినిమాలో హీరోయిన్ అయిన అమ్మడు తన ఖాతాలో ఓ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సాక్ష్యం ఫ్లాప్ తర్వాత ఆమె మళ్లీ ట్రాక్ తప్పినట్టు అనుకోగా అరవింద సమేత సినిమా హిట్ తో ఆమె లక్కీ గాళ్ అయ్యింది.


అందుకే అందరికన్నా పూజా హెగ్దె ఈ విజయంతో ఎక్కువ సంతోషపడుతుంది. ఆమె మీద ఉన్న బ్యాడ్ టాక్ ఈ సక్సెస్ తో పూర్తిగా తొలగిపోయినట్టే లెక్క. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాలో కూడా పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


ముకుంద సినిమతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె డిజే సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది. అరవింద సమేత సినిమాలో కూడా అమ్మడు బాగానే ఆకట్టుకుంది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత నాన్ బాహుబలి రికార్డులు తన పేరు మీద రాసుకునేలా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: