పవన్ సినిమా సంక్రాంతికి డిజాస్టర్ కావడంతో బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోయిన మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ మళ్ళీ లైం లైట్ లోకి వచ్చేశాడు. జూనియర్ ఎంటీయార్ మూవీ అరవింద సమేత హిట్ తో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. దాంతో ఇపుడు ఆ విక్టరీని హ్యాపీగా తాపీగా ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రం కి మరో క్రేజీ మూవీ తలుపు తట్టిందట. 


సమ్మర్ కి అల్లు అర్జుని సినిమ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదల అయింది. అది పెద్దగా ఆడకపోవడంతో బన్నీ బాగా గ్యాప్ తీసుకుంటున్నాదు. నెక్స్ట్ మూవీ కచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో బన్నీ ఉన్నాడు. ఎంతో మంది డైరెక్టర్ల కధలు వింటూన్నా ఎక్కడ కమిట్ కావడం లేదు. కారణం తెలిసిందే. అవి సరిగ్గా లేవన్న దాంతోనే బన్నీ తిరస్కరిస్తున్నాడుట. 


మధ్యలో విక్రం కుమార్ చెప్పిన కధకు ఓకే చెప్పాడని, ఇక సెట్స్ మీదకు రావడమే తరువాయి అని అనుకున్నది కూడా అలా పక్కకు వెళ్ళిపోయింది, ఇప్పటికైతే బనీ కొత్త మూవీ ఏంటన్నది క్లారిటీ లేదు. నా పేరు సూర్య కూడా రిలీజ్ అయి ఆరు నెలలు అయిపోయాయి. ఇపుడు మరో మూవీ వెంటనే మొదలుపెట్టినా పూర్తి అయి విడుదల అయ్యేసరికి కచ్చితంగా బాగాగే టైం తీసుకుంటుంది. 


ఈ టైంలో సరైన  హిట్ పక్కాగా ఇవ్వగలిగే డైరెక్టర్ కొసం సెర్చింగ్ చేస్తున్న బన్నీకి త్రివిక్రం ఇపుడు అశాదీపంలా కనిపిస్తున్నాడుట. మళ్ళీ  ఫాం లోకి వచ్చిన త్రివిక్రంతో మూవీ చేసేందుకు బన్నీ రెడీ అంటున్నాడుట. ఈ ఇద్దరూ కూడా గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీస్ చేసి వరస హిట్లు కొట్టారు. లేటెస్ట్ మూవీ హిట్ కొడితే హ్యాట్రిక్ అవుతుంది. తొందరలోనే సెట్స్ మీదకు వచ్చే ఈ మూవీని వచ్చే ఏడాది దసరాకు విడుదల చేస్తారని టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి: