మెగా స్టార్ హోదాలో లక్షలాది మంది అభిమానులు కలిగిన చిరంజీవి ప్రస్తుతం జార్జియా దేశంలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు అంటే ఎవరూ నమ్మలేని విషయం. అయితే చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘సైరా’ మూవీ కోసం ఇప్పుడు అక్కడ పార్ట్ టైమ్ ఎడిటర్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 
First look of Sye Raa Narayana Reddy
ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న యుద్ద సన్నివేశాలు ‘సైరా మూవీలో సుమారు 20 నిముషాల పాటు ఉంటాయని టాక్. ఈ వార్ ఎపిసోడ్ కోసం సుమారు 40 కోట్లు ఖర్చు పెడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ నుండి తీసుకు వచ్చిన సాంకేతిక నిపుణులతో ఈ వార్ సీన్స్ ప్రస్తుతం జార్జియాలో తీస్తున్నారు. 
Sye Raa Narasimha Reddy Teaser: Chiranjeevi's Gift For Fans Is Truly Spectacular
ఇలాంటి పరిస్థుతులలో అక్కడ చిత్రీకరింపబడుతున్న వార్ సీన్స్ కు సంబంధించిన పుటేజ్ ని ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు ఎడిట్ చేయడానికి చరణ్ ఒక ప్రత్యేకమైన ఎడిటింగ్ టీమ్ ను హైదరాబాద్ నుండి పంపినట్లు సమాచారం. ఈ టీమ్ ఎప్పటికప్పుడు చిరంజీవి సలహాతో వార్ సీన్స్ ను ఎడిట్ చేస్తూ మళ్ళీ రీ షూట్ అవసరం లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు టాక్. 
Sye Raa Narasimha Reddy teaser: Chiranjeevi's aggression and the thumping musical score will leave you hooked - watch video
రామ్ చరణ్ నటించే చాల సినిమాలకు చిరంజీవి ఎడిటింగ్ విషయంలో చాల సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా ‘సైరా కోసం ఇలా పార్ట్ టైమ్ ఎడిటర్ గా మారడమే కాకుండా తన దగ్గరకు వచ్చిన ఎడిటింగ్ టీమ్ కు చిరంజీవి ఇస్తున్న సలహాలు విని ఎంతో అనుభవం ఉన్న ఆ టీమ్ కూడ ఆశ్చర్యపోతున్నట్లు టాక్. వచ్చే సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీతో ‘బాహుబలి 2’ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలి అన్న తపనతో చిరంజీవి ప్రతి చిన్న విషయంలోనూ ఈసినిమాకు సంబంధించి వ్యవహరిస్తున్న తీరు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: