మీటు.. ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపనాలు రేపుతోంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత సుభాష్‌ ఘాయ్‌ కొన్నేళ్ల క్రితం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణల్ని ఖండించిన సుభాష్ ఘాయ్.. ‘మీటూ’ ఉద్యమం అనేది ఓ ఫ్యాషన్‌లా తయారైందని వ్యాఖ్యానించారు. ఒక్కరాత్రి తనతో గడిపితే ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని, లేకపోతే నువ్వు ఏం చేయలేవని తనను లైంగికంగా వేధించాడని మోడల్, నటి కేట్ శర్మ ఆరోపించారు.

Image result for kate sharma

పోలీసులను ఆశ్రయించి సుభాష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన రేప్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకోని దర్శకుడు సుభాష్.. ఫ్యాషనైపోయిందని పేర్కొన్న కొన్ని గంటలకే కేట్ శర్మ ఫిర్యాదు చేయడం గమనార్హం. ‘సుభాష్‌ ఘాయ్ ఆగస్టు 6న తన ఇంటికి నన్ను పిలిచారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఆరుగురు వ్యక్తులున్నారు. మసాజ్‌ చేస్తావా అని వారి ముందే నన్ను అడిగాడు. పెద్దాయన అన్న గౌరవంతో రెండు నుంచి మూడు నిమిషాలు మసాజ్‌ చేశా. చేతులు కడుక్కోవడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్తే నా వెంటే ఆయన వచ్చారు. 

Image result for kate sharma

ఏదో మాట్లాడాలి అని చెప్పి నన్ను తన బెడ్రూమ్‌కు తీసుకెళ్లారు. అకస్మాత్తుగా నన్ను దగ్గరికి లాక్కుని కౌగిలించుకున్నాడు. ఆపై ముద్దు పెట్టబోయాడు. నేను త్వరగా వెళ్లిపోవాలి అని చెప్పా. ఓ రాత్రి తనతో గడిపితే ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను. లేకపోతే నీకు మరో అవకాశం లేదని’ వేధించినట్లు మోడల్ కేట్ శర్మ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: