బర్నింగ్ స్టార్ గా కొంతకాలం క్రితం వరకు మంచి క్రేజ్ లో ఉన్న సంపూర్ణేష్ బాబు క్రేజ్ ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. అతడు నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అతడికే తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో సంపూ లేటెస్ట్ గా చేసిన ఒక సాహసం టాప్ హీరోలను కూడ ఆశ్చర్యపోయేలా చేసింది.
Sampoornesh-Babu
గతవారం ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంద్ర జిల్లాలను కుదిపేసిన తుఫాన్ ఆజిల్లాల ప్రజలకు వేలాది కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చి పెట్టింది. అయితే ప్రజలకు ఏకష్టం వచ్చినా సాధారణంగా స్పందించే టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు కనీసం ఆ తుఫాన్ గురించి కూడ పట్టించుకోలేదు. 
Sampoornesh Babu
సినిమాల నుండి రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి పవన్ కళ్యాణ్ లు కూడ ఈ తుఫాన్ నష్టం గురించి ఒక్క మాట కూడ మాట్లాడకపోవడమే కాదు కనీసం ఒక్క రూపాయి కూడ తుఫాన్ బాదితుల సహాయ సహకారాల కోసం విరాళంగా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం అవకాశాలు లేని సంపూర్ణేష్ ముఖ్యమంత్రి సహాయనిదికి 50  వేలు విరాళంగా అందరికీ షాక్ ఇచ్చాడు. 
Actor Sampoornesh Babu
గతంలో ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో జరిగిన ధర్నా కోసం సంపూ తెలంగాణ వాడు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడంతో పాటు గతంలో విశాఖపట్నం జిల్లాను కుదిపేసిన తుఫాన్ సహాయ నిధికి కూడ లక్ష రూపాయలు అప్పట్లో విరాళంగా ఇచ్చాడు. దీనితో సంపూ ఇస్తున్న విరాళాలు టాప్ హీరోలకు కనిపించడం లేదా అంటూ కొందరు కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే మన టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: