టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి అంటే వెంటనే గుర్తుకు వస్తాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.  చేసింది మూడు సినిమాలే అయినా..స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ఈ మద్య రిలీజ్ అయిన ‘గీతా గోవిందం’ సినిమాలు వరుస విజయాన్ని అందుకున్నారు.  కాకపోతే ఈ నెల 5న రిలీజ్ అయిన ‘నోటా’ మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.  అయితే ఎక్కడా నిరుత్సాహ పడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ.  తాజాగా విజయ్ దేవరకొండ తమ మానవత్వాన్ని నిరూపించుకున్నాడు.
Image result for title cyclone
ఎక్కడ ఏ విపత్తు వచ్చి ప్రజలు అల్లాడిపోతున్నా సాయం చేయడంలో ముందుండే టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ మరోమారు ముందుకొచ్చాడు. ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తరాంధ్రను ‘తిత్లీ’తుఫాన్ ఛిద్రం చేసింది.  తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు తనవంతు సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు అందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న సిక్కోలును ఆదుకోవాల్సిందిగా ముందుకు రావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు.
Image result for sampoornesh babu
ఆయన పిలుపుతో పలువురు అభిమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కాగా, ఈ తిత్లీ తుఫాన్ మిగిల్చిన విషాదానికి ముందుగా స్పందించింది మాత్రం తెలుగు కామెడీ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తిత్లీ తుపాను బాధితులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆ వెంటనే విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ప్రకటించాడు.
Image result for title cyclone
బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వీరిద్దరిపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది.  అంతే కాదు ఈ మద్య వరదలతో అతలాకుతలమైన కేరళకు కూడా విజయ్ దేవరకొండ రూ.5 లక్షల విరాళం ప్రకటించాడు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ.25 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: