హాలీవుడ్ లో మొదలై ఆతరువాత బాలీవుడ్ చేరుకొని సంచలనాలు సృష్టిస్తున్న ‘మీ టూ’ ఉద్యమం తెలుగు సినిమా రంగానికి సంబంధించి టాప్ సెలెబ్రెటీల గుట్టును బయట పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బడా హీరోలు టాప్ దర్శకులు బదానిర్మాతలు సాంకేతిక నిపుణులలో కొందరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను బయటపెట్టే దిశలో ఇక్కడ కూడ ‘మీ టూ’ ఉద్యమం తార స్థాయికి చేరుకోబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.  
Me too
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి ఆద్వర్యంలో ఈ ‘మీ టూ’ ఉద్యమం ‘వాయస్ ఆఫ్ ఉమెన్’ అన్న పేరుతో తెలుగు ఇండస్ట్రీ మూలాలను షేక్ చేయబోతోంది అని టాక్. ఇండస్ట్రీలో ఉన్న కొందరు వ్యక్తుల వల్ల తాము పడ్డ లైంగిక వేధింపులను తెలియచేస్తూ ఇప్పటికే కొందరు చెపుతున్న విషయాలను ఈ ఉద్యమంలో భాగంగా రికార్డ్ చేస్తున్నట్లు వార్తల హడావిడి చేస్తున్నాయి. 

ఈ ఉద్యమానికి పరోక్షంగా సమంత సపోర్ట్ కూడ ఉంది అని తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించబోతున్న నందిని రెడ్డికి బుల్లితెరకు సంబంధించిన ప్రముఖ యాంకర్స్ సుమ ఝాన్సీల సపోర్ట్ కూడ ఉంది అని సమాచారం. ఈ ఉద్యమాన్ని మరింత వేగంగా ఇండస్ట్రీలోని వివిధ వర్గాల మహిళల దగ్గరకు తీసుకు వెళ్ళడానికి అనుసరించే వ్యూహాలను చర్చించడానికి ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక సన్నాహక సమావేశం కూడ జరిగినట్లు టాక్.
 à°ˆ కామ పిచ్చిగాళ్ళ తీట వదిలించే
ఇప్పటికే ఈ ఉద్యమానికి మద్దతుగా సమంతతో పాటు కాజల్ అనుష్కలు కూడ మాట్లాడిన సందర్భంలో ఈవిషయమై ఇప్పుడు చాలామంది ఓపెన్ గా బయటకు వచ్చి అసలు విషయాలను బయటకు చెప్పడానికి సాహసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ముందుగా ఎవరు గుట్టు బయట పడుతుంది అన్న టెన్షన్ లో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ కేసుల వ్యవహారంలా ఇప్పుడు త్వరలో బయటకు రాబోతున్న ‘వాయస్ ఆఫ్ ఉమెన్’ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోయే ఆస్కారం ఉంది అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: