రాంచరణ్ నటించిన తూఫాన్ సినిమా ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులు సిద్దమవుతున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు చెర్రీ తీసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని అటు సీమాంధ్రలో, ఇటు హైదరాబాద్ లో ఓయు జేఏసి హెచ్చరించిన విషయం తెలిసిందే. సినిమా వాయిదా వేసుకునే పరిస్తితులు లేకపోవడంతో ఇక చేసేదిలేక సినిమా యూనిట్ కోర్టును ఆశ్రయించింది. సినిమాల విడుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని, భద్రత ఏర్పాటు చేయాలని బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

విచారించిన కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. తూఫాన్ ప్రదర్శించబడనున్న అన్నిథియేటర్లకు పోలీసులతో భద్రత కల్పించాలని రాష్ట్ర డిజిపికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆరున తూఫాన్ విడుదల ఖాయమయినట్టే. పోలీసుల రక్షణ వలయంలో తూఫాన్ వినోదాన్ని తిలకించే అవకాశం దక్కినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: