క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఏవిషయం పై అయినా ఎటువంటి మొహమాటాలు లేకుండా చాల స్పష్టంగా మాట్లాడుతాడు. రాజకీయాలలో సినిమాలలో వ్యక్తిగత పొగడ్తల పూజ లేకుండా వ్యవహారాలు నడవవు. అయితే దీనికి భిన్నంగా కొంత కాలం క్రితం స్పష్టమైన కామెంట్స్ తో తన ఇగో ను హర్ట్ చేసిన ఒక యంగ్ డైరెక్టర్ కు సంబంధించిన విషయాలను బయటపెట్టి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. 
అతడు వచ్చినపుడు వద్దనుకున్నాను
ఈ ఆసక్తికర సంఘటన 'వీర‌భోగ వ‌సంత రాయులు' ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో జరిగింది. ఈమూవీకి దర్శకత్వం వహించిన ఇంద్ర‌సేన సుకుమార్ వద్ద చాల కొద్ది రోజులు మాత్రమే సహాయ దర్శకుడుగా పనిచేసాడట. సుకుమార్ ‘1 నేనొక్కడినే’ సినిమాకు సుకుమార్ టీమ్ లో పనిచేసిన ఇంద్రసేన ‘1 నేనొక్కడినే’ సినిమా భయంకరమైన ఫ్లాప్ గా మారుతుంది అంటూ ఈమూవీ విడుదలకు ముందే సుకుమార్ దగ్గర కామెంట్ చేసాడట. 
రోహిత్ బ్యాగ్రౌండ్‌తో హీరో అయ్యాడనుకున్నా
దీనితో సుకుమార్ ఇగో హర్ట్ కావడంతో ఈ యంగ్ డైరెక్టర్ సుకుమార్ కు అప్పట్లో దూరం అయ్యాడు. అయితే ఇంద్రసేన ‘1 నేనొక్కడినే’ మూవీ పై చేసిన కామెంట్స్ నిజం కావడంతో అతడి విలువ అతడు దూరం అయ్యాక తనకు తెలిసింది అంటూ సుకుమార్ సంచలన కామెంట్స్ చేసాడు. ఈ అభిమానంతోనే తాను ‘వీరభోగ వసంత రాయలు’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు తనను పిలవగానే వెంటనే వచ్చాను అంటూ అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు సుకుమార్. 
నా సినిమా బాలేదని చెప్పి ఇగో హర్ట్ చేశాడు
ఈ యంగ్ డైరెక్టర్ ఇంద్రసేన దర్శకత్వం వహించిన ‘వీరాభోగ వసంతరాయలు’ ట్రైలర్ కు విపరీతమైన స్పందన వస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ గా అక్టోబర్ 26న విడుదల కాబోతున్న ఈమూవీకి విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వచ్చింది. నారా రోహిత్ శ్రీవిష్ణు సుధీర్ బాబులు కలిసి నటిస్తున్న ఈమూవీ అనుకోని విజయం సాధించినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: