ఆ మద్య మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమై ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్న శ్రీశాంత్‌ అంటే తెలియని వారు ఉండరు.  ఫాస్ట్ బౌలర్ మాత్రమే కాదు షార్ట్ టెంపర్ గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు శ్రీశాంత్.  క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పిన తర్వాత నటుడిగా స్థిరపడ్డాడు.  తాజాగా శ్రీశాంత్ పై ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `కొమ‌రం పులి` సినిమాతో టాలీవుడ్  లోకి అరంగేట్రం చేసిన హీరోయిన్ నికీషా ప‌టేల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రస్తుతం దేశంలో మీటూ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో తన సహజీవనం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.  కొమరం పులి సినిమా తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న నికీషా తర్వాత పెద్దగా ఛాన్సు లు రాలేదు.  కాకపోతే.. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో మాత్రం ఆమె ప‌లు అవ‌కాశాలు ద‌క్కించుకుంది. 
Image result for nikesha patel serious sreesanth
అదే సమయంలో క్రికెటర్ శ్రీశాంత్ తో ప్రేమాయణం కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి.  కాకపోతే ఆ విషయంపై  వీరిద్ద‌రూ స్పందించలేదు.  కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. తన భార్య గురించి చెబుతూ ఆమెను ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అయితే ఈ విషయంపై నికీషా చాలా సీరియస్ అయ్యింది.  శ్రీశాంత్‌తో త‌న ప్రేమాయ‌ణం గురించి తొలిసారి స్పందించింది.  వేరే అమ్మాయిని ఏడేళ్ల‌పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని శ్రీశాంత్ చెప్పాడు.
Related image
మ‌రి, నాతో ఏడాదిపాటు స‌హ‌జీవ‌నం చేయ‌డం గురించి ఏమి చెబుతాడు? శ్రీశాంత్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత నేను చాలా ప్ర‌శాంతంగా ఉన్నా. అత‌ని నుంచి విడిపోయినందుకు నాకు కొంచెం కూడా బాధ లేదు. అయితే ప్రేమ గురించి అత‌ను చెబుతున్న అబ‌ద్ధాల‌ను స‌హించ‌లేక‌పోతున్నాన‌ని నికీషా వెల్ల‌డించింది. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తరువాత భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక బాబు, ఒక పాప ఉన్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: