తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు వచ్చాయి. అయితే అంతరిక్ష నేపథ్యంలో మాత్రం ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. ఆ మద్య తమిళ ఇండస్ట్రీలో తెరకెక్కిన టిక్..టిక్..టిక్..తెలుగు లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా రానా హీరోగా నటించిన ‘ఘజీ’ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలకు ఆ మద్య సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారి స్పేస్ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇదే. వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్ చూస్తున్నంత సేపు అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నామా అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్లో ఈ అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అధ్బుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించారు.
టీజర్ కూడా విజువల్ గా ఎంతో ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రియలిస్టిక్ గా కనిపిస్తుంది. కేవలం 57 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠను పెంచేస్తున్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమాలో నటించిన తారలందరూ కూడా యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. డిసంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!