ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.   మంచీ, చెడూ ప్రతి విషయంలోనూ ఇట్టే వైరల్ అవుతున్నాయి.  తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి కన్నడీగులు ఫైర్ అవుతున్నారు.  సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల షూటింగ్ సమయాల్లో ఏ మాత్రం విరామం దొరికినా..విదేశాల్లో షూటింగ్ ఉన్న తన కుటుంబ సభ్యులను తీసుకు పోవడం తెలిసిన విషయమే.. మహేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ న్యూ యార్క్‌లో జ‌రుగుతుండ‌గా, ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్ళాడు. 
Related image
ఇక విజయదశమి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ శుభాకాంక్షలు..తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ట్వీట్ చేశాడు. . దీనిపై కన్నడ ప్రజలు మహేష్‌ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. క‌న్న‌డ‌లో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి మీకు మేము క‌నిపించ‌డం లేదా, మా భాష‌లో ధ‌న్య‌వాదాలు చెప్ప‌లేక‌పోయారా అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అయ్యారు. కన్నడ అభిమానులపై మీరు చూపించిన ఈ పక్షపాతం అస్సలు బాగోలేద‌ని అన్నారు.
Image result for mahesh babu maharshi images
త్వరలోనే మీకు కన్నడ అభిమానులు గుణపాఠం చెబుతారని కొందరు హెచ్చరించారు.  దీంతో వారు మ‌హేష్‌ని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.  ఇది గమనించిన మహేష్ బాబు వెంటనే  ఫేస్ బుక్ పేజ్ , ట్విట్ట‌ర్ పేజ్ ద్వారా క‌న్న‌డిగుల‌కి కూడా వారి భాష‌లో ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీంతో అంద‌రు కూల్ అయ్యారు.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు.  ఈ సినిమాలో మహేస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: