ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం భారీ స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలువురు నటీమణులు గతంలో తమ పట్ల జరిగిన లైంగిక దాడుల గురించి స్పందిస్తున్నారు.  ఇక బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు తమపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తనూశ్రీ దత్తా గతంలో నానా పటేకర్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడని..లైంగికంగా వేధించాడనని ఆరోపణలు చేసింది. 
Image result for tanu sri dutta kangana
తనూశ్రీ చేసిన ఆరోపణలతో బాలీవుడ్ లో పెద్ద సంచలనం చోటు చేసుకుంది.  ఆమెకు మద్దతుగా పరిణితీ చోప్రా, ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ ఖన్నా, శిల్పాశెట్టి, డింపుల్‌ కపాడియా, ఫర్హాన్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచారు.  అంతే కాదు నానా పటేకర్ ఈ విషయంపై వివరణ ఇవ్వాలని సీఐఎన్‌టీఏఏ (సినీ, టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నోటీసులు జారీచేసింది. 
Image result for tanu sri dutta kangana
ఈ నోటీసులపై స్పందించిన నానా పటేకర్ ఎప్పుడో ఏదో జరిగిందని తనుశ్రీదత్తా కట్టుకథ అల్లింది. అవి పూర్తిగా నిరాధార తప్పుడు ఆరోపణలు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని బాలీవుడ్‌ నటుడు నానాపటేకర్‌ వివరణ ఇచ్చారు. త్వరలో ఆమెకు లీగల్‌ నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: