టాలీవుడ్ లోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘ప్రేమకథ’సినిమాతో హీరోగా పరిచయం అయిన సుమంత్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా సూపర్ హిట్ కొట్టలేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవైఏళ్లు అయిన సుమంత్ మాత్రం కెరీర్ మాత్రం సక్సెస్ గా సాగడం లేదు. సుమంత్ తర్వాత నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు మంచి మార్కులే కొట్టేశారు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో తన తాత ఏఎన్ఆర్ పాత్రలో కనిపిస్తున్న సుమంత్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా సుమంత్ నటిస్తున్న సినిమా "సుబ్రహ్మణ్యపురం". సంతోష్ జాగర్లపూడి దర్శకుడు.
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ‘డబ్బు ఉండే సరికి నాలుగు గోడలు లేపేసి జనాలకు భక్తి ఉంది కాదా అని ఏదో ఒక రాయిని విగ్రహంగా పెట్టేస్తే.. అది దేవాలయం అవుతుందా చెప్పు’ అంటూ ‘సుబ్రహ్మణ్యపురం’ సుమంత్ కొట్టే డైలాగ్స్ చూస్తుంటే..సినిమా కాస్త డిఫరెంట్ మోడ్ లో సాగుతున్నట్లు కనిపిస్తుంది.
ఓ గుడి.. అందులో వరసగా మర్డర్లు.. దాన్ని చేధించాడానికి వచ్చే ఓ టీం.. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి.. ఇలా ఇవన్నీ చూసినపుడు మనకు తెలియకుండానే కార్తికేయ గుర్తొస్తుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ను రిలీజ్ చేశారు. విజయదశమి కానుకగా సోషల్మీడియాలో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండ్ అవుతోంది. ఆ మద్య సుమంత్ నటించిన ‘మళ్లీరావా’ కమర్షియల్గా ఆడలేదు కానీ ప్రశంసలు తీసుకొచ్చింది.. అలాగే సుమంత్ అనే ఓ హీరో ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాడు అని ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేసింది.ఈ ఒక్క సినిమా ఇచ్చిన ఉత్సాహంలో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు సుమంత్.
భారతీయ దేవాలయాలపై హేతుబద్ధంగా రీసెర్చ్ చేసిన కార్తీక్ పాత్రలో సుమంత్ ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. నాస్తికుడిగా కనిపించే కార్తీక్ కి ఆ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కున్నాడు? అనే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగనుంది. సుమంత్, ఈషా రెబ్బ, సురేష్, తనికెళ్ళ భరణి, జోష్ రవి, భద్రమ్, గిరి, మాధవి, హర్షిణి, అమిత్, టిఎన్ఆర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.