‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన శ్రియ సరన్ పలు భాషా నటించింది. ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిదేళ్లు దాటుతున్నా..ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూ..హీరోయిన్ గా నటిస్తుంది. ఆ మద్య శ్రియ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించదని కామెంట్స్ వినిపించాయి. కానీ తనకు నచ్చేంత వరకు..సినిమాల్లో నటిస్తానని చెప్పింది శ్రియ. కెరీర్ స్టార్టింగ్ నుంచే తన అందచందాలతో యువత మనసు దోచుకున్న ఈ భామకు నేటికీ ఆ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతోంది.
తాజాగా శ్రీయ చేస్తున్న కొత్త సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమయ్యింది. కాగా, ఈ సినిమా ప్రమోషన్ ను కూడా యూనిట్ సభ్యులు ప్రారంభించారు. ప్రమోషన్స్ లో భాగంగా శ్రియ మాట్లాడుతూ, తన కెరీర్ లో ఎన్నడూ చేయని ఓ విభిన్న పాత్రలో తాను కనిపించనున్నానని చెప్పింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం తనకు చాలా ఇబ్బంది అనిపించిందని తెలిపింది.
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండటంతో... గదంతా పొగతో నిండిపోయిందని... గదిలో ఉన్నవారమంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఒకదశలో ఈ సన్నివేశం ఏంటిరా బాబూ ఎప్పుడు అయిపోతుందో అన్న ఇరిటేషన్ కూడా వచ్చిందని అన్నారు. కానీ కొన్ని సీన్లు నేచురల్ గా రావాలంటే..అలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు శ్రియ. సినిమా విషయానికి వస్తే..ఇప్పటి వరకు లేని కొత్త కాన్సెప్ట్ ఈ సినిమాలు చాలా అద్భుతంగా చూపించారని..ఎవరి పాత్ర వారు చాలా గొప్పగా చేశారని..సంగీతం కూడా చాలా బాగుందని..అడియన్స్ కి కొత్తదనం కనిపిస్తుందని అన్నారు.