అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో ఈరోజు సాయంత్రం శిల్పకళావేదికలో జరుగనుంది. ఈ వేడుకకు సర్ ప్రైజ్ గెస్ట్ గా నందమూరి నట సిం హం బాలకృష్ణ అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఎన్.టి.ఆర్, బాలకృష్ణ ల మధ్య దూరం ఉన్న మాట వాస్తవమే కాని హరికృష్ణ మరణంతో కుటుంబాలు దగ్గరయ్యాయి.


బాబాయ్ అబ్బాయ్ ల కలయిక కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఈరోజు పండుగ చేసుకోనున్నారు. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. దసరాకు పర్ఫెక్ట్ బొమ్మ ఇదే అనిపించేలా వసూళ్ల హంగామా కూడా చేస్తుంది ఈ సినిమా.


సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా ఈషా రెబ్బ, సునీల్ నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంగీతం పరంగా కూడా మంచి హిట్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో నందమూరి వర్గాల్లో ఆనదోత్సాహం నిండగా సక్సెస్ మీట్ కు బాలకృష్ణ రావడం కూడా మరింత క్రేజ్ తెచ్చింది.


8 ఏళ్ల క్రితం ఎన్.టి.ఆర్, బాలకృష్ణ కలిసి ఒకే వేదిక మీద కనిపించారు. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఈ ఇద్దరు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈ వేడుక ఎలా జరుగనుంది. ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుతారు అన్నది సాయంత్రం సక్సెస్ మీట్ చూస్తే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: