బాబాయ్, అబ్బాయ్ ల మధ్య ఎనిమిదేళ్లుగా ఉన్న దూరానికి తెర పడింది. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని దగ్గరయ్యేలా చేసింది. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లకు తన ప్రేమను పంచాడు బాలకృష్ణ. అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకోగా ఎన్.టి.ఆర్, బాలయ్య మళ్లీ ఒకటయ్యారని చెప్పొచ్చు.


ఇక ఇదే క్రమంలో ఈమధ్యనే వచ్చి సూపర్ హిట్ కొట్టిన అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ కు బాలకృష్ణ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడని తెలుస్తుంది. ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో బాలయ్య స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు. బాలకృష్ణ రాక కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ ఈ సక్సెస్ మీట్ కు రావడం వెనుక కళ్యాణ్ రాం కారణమట. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బాలకృష్ణ తో పాటు నటిస్తున్న కళ్యాణ్ రాం తమ్ముడి సక్సెస్ మీట్ కు రావాల్సిందని బాలయ్యను కోరాడట. కళ్యాణ్ రాం కోరిక మేరకే బాలయ్య వస్తున్నాడట.


ఒకే వేడుకలో ఒకే స్టేక్ మీద ఎన్.టి.ఆర్ పక్కనే బాలకృష్ణ ఈ కలయిక కోసం ఎనిమిదేళ్లుగా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు అసలైన దసరా పండుగ వస్తుందని చెప్పొచ్చు. అరవింద సమేత అక్టోబర్ 11న రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ మార్క్ దాటేసింది. ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాజ్ తో కనిపించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా తమన్ మ్యూజిక్ అందించారు. హీరోగా కెరియర్ సాటిస్ఫైడ్ గా లేని సునీల్ ఈ సినిమాతో మరోసారి సపోర్టింగ్ రోల్ లో నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: