ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ కొద్ది నిమిషాల క్రిరం శిల్పకళావేదికలో జరిగింది. ఈ వేడుకకు నందమూరి నట సిం హం బాలకృష్ణ అటెండ్ అవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డులు అందించారు.


చిత్రయూనిట్ అంతా మాట్లాడిన తర్వాత కళ్యాణ్ రాం మాట్లాడారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన బాబాయ్ బాలకృష్ణకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు కళ్యాణ్ రాం. ఎన్.టి.ఆర్ కూడా మాములుగా ఈ వేడుకలో నాన్నగారు ఉండాలి. ప్రత్యక్షంగా లేకున్నా ఆయన మనతోనే ఉండి ఉంటారు. నాన్న లేకున్నా తండ్రి హోదాలో వచ్చిన బాబాయ్ బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపాడు. 


ఇక మైకు అందుకున్న బాలకృష్ణ తన మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టారు. సినిమాకు పనిచేసిన యూనిట్ అందరిని ప్రశంసించిన బాలయ్య బాబు ఇలాంటి పాత్రలు చేయడం మా వంశం వల్లే అవుతుందని అన్నారు. ఇక స్పీచ్ మొదలు పెట్టడమే అన్న హరికృష్ణ గురించి ప్రస్థావించారు.


ముక్కుసూటితనం.. అనుకున్నది చేసే ధైర్యశాలి అయిన అన్న హరికృష్ణ లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నమ్మశక్యంగా లేదు. పైకి మొరటుగా కనిపించినా మనసు వెన్న.. తెలుగు దేశం పార్టీ చైతన్య రధసారధి హరికృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. హిందూపురం నుండి ఎన్నికై ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. అన్న మరణం మాకుటుంబానికి తీరని లోటని హరికృష్ణ మీద తనకున్న మమకారం చూపించారు బాలకృష్ణ. స్పీచ్ లో భాగంగా నటుడిగా జూనియర్ ఎన్.టి.ఆర్, తాను పాత్రకు పరిపూర్ణత తెచ్చే నటులమని చెప్పడం విశేషం. వేదిక మీద.. సీట్ లో కూర్చున్నప్పుడు కూడా ఎన్.టి.ఆర్ తో బాలకృష్ణ పదే పదే మాట్లాడటం ఫ్యాన్స్ ను అలరించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: