అరవింద సమేత సక్సెస్ మీట్ కు నందమూరి అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అరుదైన కలయిక బాలయ్య, ఎన్.టి.ఆర్ లు ఒకే వేదిక మీద కనిపించారు. బాలయ్య బాబు ఎన్.టి.ఆర్ ల మధ్య మాటలు నందమూరి అభిమానులను అలరించాయి. అయితే స్టేజ్ మీద మాత్రం బాలయ్య మాట్లాడిన తీరుకి కొంత అసహనంలో ఉన్నారు.


బాబాయ్, అబ్బాయ్ ల మధ్య కొన్నాళ్లుగా మాటలు లేవు అయితే దాన్ని ఛేధించి కొంతమంది మధ్య వర్తిత్వం చేద్దామని చూసినా అంతగా లాభం లేకుండా పోయింది. హరికృష్ణ మరణం మళ్లీ ఈ ఇద్దరిని ఒక చోట కలిసేలా చేసింది. ఇద్దరు మళ్లీ ఒకప్పటి ప్రేమానురాగాలతో కనిపిస్తున్నారు.


అయితే నిన్న జరిగిన అరవింద సమేత సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ సినిమాకు పనిచేసిన యూనిట్ అందరి గురించి మాట్లాడాడు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు అందరిని ప్రశంసించగా ఎన్.టి.ఆర్ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్థావించడం మర్చిపోయాడు. బాలయ్య నిజంగానే మర్చిపోయాడా లేక జూనియర్ గురించి కావాలనే మాట్లాడలేదా అన్నది హాట్ న్యూస్ గా మారింది.


మైక్ అందుకున్న వెంటనే అన్న హరికృష్ణ గురించి గొప్పగా మాట్లాడిన బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడు హరికృష్ణ అని అన్నారు. ఇక తనదైన సంస్కృత పద్యాలతో వచనాలతో బాలయ్య నందమూరి ఫ్యాన్స్ ను అలరించాడు. అయితే ఎన్.టి.ఆర్ గురించి కూడా ఓ రెండు మాటాలు మాట్లాడితే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: