ఇండస్ట్రీల కొన్ని సినిమాలు చిరస్థాయిగా గుర్తుండి పోతుంటాయి..మరికొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తుంటాయి. పాత తరం నుంచి నేటి తరం వరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు అలా వచ్చాయి.  తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడమే కాదు..కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది.  మొదటి వారం వంద కోట్ల క్లబ్ లో చేరింది.  కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.  ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ రావడంతో సక్సెస్ మీట్ కి మరింత వన్నె వచ్చింది.   ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఎన్నో విషయాలు తెలిపారు.   
Image result for aravinda sametha movie success meet
మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఒక్క వెలుగు వెలిగారు..అదే సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు..తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంపోందించేందుకు తెలుగుదేశం పార్టీ  స్థాపించారు.  అయితే పార్టీ వ్యవహరాలు చూసుకునే కార్యక్రమంలో నాన్నగారికి అన్ని విధాలుగా తోడు ఉంటూ..ఆయనకు ఎంతో సేవ చేశారు..తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు, చైతన్య రథ సారధి, మా అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేరంటే నమ్మలేక పోతున్నానని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు.
Image result for aravinda sametha movie success meet
ఇక ‘అరవింద సమేత’కు ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు అన్నారు.  మీ ఆదరణ, అభిమానం మమ్ముల్ని ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు.   తాను ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయానని తెలిపారు. మహిళ అంటే ఎంతో గొప్పది అనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ..తాను, తారక్ ఎప్పుడు తెరపై కనిపిస్తారని ఎంతో మంది అడుగుతున్నారని..ఒకవేళ అలాంటి సమయం వస్తే..ఆ సినిమా  మరెవరూ చేయలేరని, అసాధ్యమని ఈ సందర్భంగా బాలయ్య అన్నారు.
Image result for nandamuri harikrishna
తమ సినిమాలో నవరసాలు ఉండాలని చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలను గొప్పగా తీస్తారని కితాబిచ్చారు. చారిత్రక సినిమాలు, పోరాట చిత్రాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరని అన్నారు. తమ అభిమానులంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. జోహార్ హరికృష్ణ, జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: