దేశంలో ఈ మద్య ‘మీటూ ’ఉద్యమం పేరు తో మహిళలు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బాహాటంగానే వెల్లబుచ్చుతున్నారు. హాలీవుడ్ లో పలువురు హీరోయిన్లు ఇండస్ట్రీలో తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు..అక్కడ నుంచి పుట్టుకొచ్చింది ‘మీటూ ’ ఉద్యమం. ఇప్పుడు భారత దేశంలో కూడా మీటూ ఉద్యమం ఉధృతం అవుతుంది. సినీ రంగంలోనే కాదు వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. తాజాగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ‘మీటూ ’ప్రపంపణలు పుట్టిస్తుంది. ఇప్పటికే తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ పలువురు నటిమణులు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ నటుడు అర్జున్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది హీరోయిన్ శ్రుతి హరిహరణ్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అర్జున్ పై ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే అర్జున్ రెండేళ్ల కిందట ఓ చిత్రం షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శ్రుతి హరిహరణ్ ఆరోపించింది. దాంతో తమిళ నాట ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన అర్జున్..ఇప్పటివరకు దాదాపు అరవై మంది హీరోయిన్లతో నటించి ఉంటానని, ఎవరూ తన గురించి ఇలా మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే శృతి చేసిన ఆరోపణలు నా మనసు ఎంతో గాయం చేశాయని అన్నారు అర్జున్. అంతే కాదు ఈ విషయం గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదనుకున్నాను..కానీ మాట్లాడకుంటే..తాను నిజంగా తప్పు చేసిన వాడినవుతానని అనుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ చిత్రంలో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి..దాంతో నాకు అసౌకర్యంగా ఉందని ఆ చిత్రంలో నటించలేని దర్శకుడి చెప్పానని అన్నారు. అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు. నిజంగానే నేను అలా ప్రవర్తించి ఉంటే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె ఎందుకు నన్ను ప్రశంసించింది. ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తోంది. ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా అంటూ అర్జున్ ప్రశ్నించారు.