బాలీవుడ్ లో ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. `హార్న్ ఓకే ప్లీజ్` షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగిక వేధించాడని..తనను ఘోరంగా అవమానించాడని ఆరోపించింది. ఆ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ సమయంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అందువల్లే ఆ పాట నుంచి తప్పుకున్నానని తనుశ్రీ వెల్లడించింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో పలువురు నటీ, నటులు నానా పటేకర్ కి మద్దతు ఇస్తుంటే..మరికొందరు విమర్శిస్తున్నారు.
తాజాగా హాట్ బ్యూటీ డ్యాన్సర్ రాఖీ సావంత్ ఈ విషయంపై స్పందించింది. ఆ సాంగ్ లో తనూశ్రీ దత్తా తప్పుకోవడంతో ఆ పాటలో రాఖీ నర్తించింది. తాజాగా ఆ పాట గురించి, నానాపై తనుశ్రీ ఆరోపణల గురించి ఓ టీవీ కార్యక్రమంలో రాఖీ మాట్లాడింది. ఈ మద్య కొంత మంది చీఫ్ పబ్లిసిటి కోసం రక రకాలుగా ప్రయత్నిస్తున్నారని..అందులో తనూశ్రీ దత్తా ఒకరని ఆరోపించింది.
పదేళ్లుగా కోమాలో ఉంది. ఇప్పుడు మేల్కొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది. పదేళ్ల తర్వాత ఆమెరికా నుంచి వచ్చి.. పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. నానా పటేకర్, గణేష్ ఆచార్యపై ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు. అప్పుడు నిజంగా ఏమీ జరగలేదు అని రాఖీ వెల్లడించింది.