ఈ మద్య కొత్త దర్శకులు, సినీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  ఈ నేపథ్యంలో ‘ఆర్ ఎస్ 100’చిత్రంతో  దర్శకుడిగా అజయ్ భూపతి పరిచయం అయ్యాడు.  ఇక హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ లు పరిచయం అయ్యారు.  ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో రిలీజ్ అయిన ఆర్ ఎక్స్ 100 సూపర్ హిట్ అయ్యింది..పెట్టిన పెట్టుబికి పది రెట్లు వచ్చింది.  ఇలా కంటెంట్ బాగుంటే..తెలుగు ప్రేక్షకులు ఎలాంటి చిత్రాలనైనా ఆదరిస్తారని నిరూపించారు.  తాజాగా ఇప్పుడు దేశంలో ‘మీ టూ ’ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఈ ఉద్యమం ద్వారా ఎంతో మహిళలు గతంలో తమపై జరిగిన అన్యాయాలపై స్పందిస్తూ..నానా హంగామా చేస్తున్నారు.   అయితే ఆడవారికి వ్యతిరకేంగా మగవారు కూడా తమపై మహిళలు అన్యాయంగా దాడి చేస్తున్నారని..లేని పోని ఆరోపణలు చేస్తున్నారని..మెన్ టూ ఉద్యమం మొదలు పెడుతున్నారు.  తాజాగా ఇదే కాన్సెప్ట్ తో.. టెమ్ట్ రవి మీ టూ అంటూ ముందుకొస్తున్నారు.

‘ఏడు చేపల కథ’ చిత్రంలో టెంప్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో మెప్పించబోతున్నారు అభిషేక్ రెడ్డి. అడల్డ్ కామెడీ జోనర్ సినిమా రూపొందుతోంది. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్నారు.  కాగా ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జి.వి.ఎన్ నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: