మల్టీస్టారర్ సినిమా ట్రెండ్ కొనసాగుతున్న టాలీవుడ్ లో ఓ మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పి సినిమా పూర్తయ్యాక సినిమా అవుట్ పుట్ మీద నమ్మకం కోల్పోయిన ఆ హీరోలు ఆ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారు. అందుకే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన టైంలో ఎవరి దారి వారు చూసుకున్నారు.


యువ హీరోల మధ్యే ఈగో క్లాషెస్ వచ్చాయని లేటెస్ట్ టాక్. ఇంతకీ అదేం సినిమా ఆ హీరోలెవరు అంటే.. వీర భోగ వసంత రాయలు సినిమాలో నటించిన నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు హీరోలకు వారి మధ్యలో మనస్పర్ధలు రావడంతో సినిమాను మధ్యలోనే వదిలేశారు. సినిమా షూటింగ్ పూర్తయినా డబ్బింగ్ విషయానికి వచ్చే సరికి ప్రాజెక్ట్ నుండి అందరు తప్పుకున్నారట.  


అందుకే సినిమా ట్రైలర్ లో సుధీర్ బాబు వాయిస్ వేరే వాళ్లతో చెప్పించారు. యువ హీరోల మధ్య ఈగో క్లాష్ రావడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే నారా రోహిత్, సుధీర్ బాబు కలిసి శమంతకమణి సినిమాలో నటించారు. ఆ సినిమా టైంలో హీరోల మధ్య రిలేషన్ బాగున్నా వీర భోగ వసంత రాయలు టైం కు సీన్ మారింది.  


అందరు కలిసి సినిమాను అన్యాయం చేశారని అంటున్నారు. ఇక సినిమా ప్రీమియర్స్ నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంద్రసేన డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి హీరోల మధ్య గొడవ సినిమా మీద ఎంత ప్రభావం చూపిస్తుందో వీర భోగ వసంత రాయలు సినిమా చూస్తే అర్ధమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: