ఇల్లీ బేబీని మరో మారు తెలుగు ప్రేక్షకులు చూసి తరించే అవకాశం వచ్చింది. చాలా కాలం తరువాత ఇలియానా తెలుగు మూవీ ఒకటి చేస్తోంది. ఈ మూవీ హీరో ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. శ్రీను వైట్ల, రవితేజా కాంబోలో లేటెస్ట్ గా అమర్ అక్బర్ ఆంధోనీ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ మూవీలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ ఇలియానాను తీసుకున్నారట.


ఈ మూవీలో చేసేందుకు ఇల్లీ బేబీ ఎటువంటి మొహమాటం లేకుండా రెండు కోట్లు అడిగిందిట. మొదట బేరాలు ఆడినా చివరకి ఆమె చెప్పిన ఫిగర్ ని నిర్మాతలు ఇచ్చారట. మరి ఇలియానా డిమాండ్ ఆలా ఉంది. మొదట టాలీవుడ్లో సక్సెస్ అయిన ఇల్లీ బేబీ బాలీవుడ్ వెంట పరుగులు పెట్టింది. అక్కడ సరైన హిట్స్ ఆమెకు లేవు. అయినా అక్కడే చాన్సుల  కోసం ట్రై చేస్తోంది. ఆమెను మళ్ళీ తెలుగు వైపు రప్పించాలని శ్రీను  వైట్ల చేసిన ప్రయత్నం నిర్మాతకు భారీ మొత్తం చెల్లించేలా చేసింది. పైసా కూడా తగ్గనంటూ ఇల్లీ బేబీ పెద్ద కిక్కే ఇచ్చేసిదంటున్నారు.


అంతకు ముందు రవితేజాతో కిక్ లాంటి మూవీ చేసిన ఇలియానా మరో మారు జోడీగా కనిపించబోతోంది. మరి ఈ హిట్ పెయిర్ మళ్ళీ హిట్ కొడతారా అన్న అంచనాలు అపుడే ఈ మూవీ మీద మొదలయ్యాయి. రవితేజా ఇందులో మూడు పాత్రల్లో కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్స్ వద్ద కూడా ఇల్లీ బేబీ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిందని గుగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజా  మూవీ హిట్ అయితే ఇల్లీ మరో మారు టాలీవుడ్లో వీర విహారం చేస్తుదనుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: