ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలబ్రెటీలు గతంలో ఏదో ఒక టివి ఛానల్స్ లో వస్తే..ఇంటర్వ్యూలో అభిమానులతో తమ అనుభవాలు షేర్ చేసుకునే వారు..కానీ ఈ మద్య ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగామ్ లు వచ్చిన తర్వాత అభిమానులతో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారు.  వీటి వల్ల వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి..అదే క్రమంలో నష్టాలు కూడా ఉన్నాయి.  తమకు సంబంధించిన సోషల్ మాద్యమాలు హ్యాక్ అయితే..వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఇప్పటికే పలువురు సిని సెలబ్రెటీల ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లు హ్యాక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇక రకూల్ ప్రీత్ సింగ్ మాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. సినిమా చూసి రివ్యూలివ్వడం దగ్గర నుంచి పుట్టిన రోజులకు శుభాకాంక్షలు చెప్పడం వంటివన్నీ చాలా సరదాగా చేసేస్తోంది.  ఈ మద్య మీ టూ ఉద్యమం పై కూడా రచ్చ రచ్చ చేసింది.  రకుల్ ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది. అది రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఏ లింక్స్ పట్ల, మెసేజ్‌ల పట్ల స్పందించవద్దు’’ అని రకుల్ ట్వీట్‌లో అభిమానులను కోరింది.

అయితే తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫేక్ న్యూస్ గానీ, ఫోటోలు కానీ రావొచ్చని..దయచేసి అభిమానులు రియాక్ట్ కావొద్దని అంటుంది.   ప్రస్తుతం టాలీవుడ్‌లో కథానాయిక రకుల్ ప్రీత్‌కి పెద్దగా సినిమాలేమీ లేవు. ఈ మధ్యే అమ్మడు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో మెప్పించబోతోంది. ఈ చిత్రం తప్పితే ముద్దుగుమ్మకు సినిమాలు లేవు.  బాలీవుడ్ లో కూడా ఈ మద్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరి రకూల్ ప్రాబ్లమ్ ఎప్పుడు తీరుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: