సాధారణంగా మనిషికి దెయ్యాలు, భూతాలు, చేతబడులు, భాణామతి ఇలాంటి తాంత్రిక శక్తులు అంటే భయం.  అయితే వాటికి సంబంధించిన సినిమాలు అంటే మాత్రం ఎక్కు క్యూరియాసిటి చూపిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో పాపులర్ అయిన ‘హలోవీస్’ ఇప్పుడు భారత దేశంలో కూడా చేసుకుంటున్నారు.  ఇదో విచిత్రమైన సాంప్రదాయం..రక్తం తాగే నరమాంస భక్షకులు.. ప్రాణాలు తీసే రాక్షసులు.. భయంకర రూపాలు ఇదీ  ‘హలోవీస్’ కాన్సెప్ట్. 
 సుష్మిత నిహారిక కొణిదెల
ఈ ‘హలోవీస్’ ఎక్కువగా సెలబ్రెటీలు జరుపుకుంటున్నారు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ ‘హలోవీస్’ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. చిరంజీవి రాక్షసుడి అవతారం కనిపించగా.. మిగిలిన కుటుంబ సభ్యులు అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శ్రీజ, సుస్మిత, నిహారిక, ఉపాసనలతో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులు, పిల్లలు దెయ్యాలు, భూతాలుగా సందడి చేశారు. 
 చిరంజీవి ఇంట్లో పార్టీ ఫోటోస్
ఇందులో మరీ ప్రత్యేకంగా రాంచరణ్ సతీమణి ఉపాసన రక్త పిశాచిలా కనిపిస్తూ..తన అత్త సురేఖను ఆటపట్టిస్తున్న ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే రామ్ చరణ్ స్వామి మాలలో ఉండటంతో ‘హాలోవీన్’ మేకప్‌కి దూరంగా ఉన్నా.. సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: