అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సవ్యసాచి. టైటిల్ దగ్గర నుండి అంచనాలు పెంచిన ఈ సినిమా నంవంబర్ 2న రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.


సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించడం విశేషం. మాధవన్, భూమిక లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. విక్రం ఆదిత్యలుగా ఇద్దరుగా ఉన్న వ్యక్తులు ఒకరిగా పుట్టడం ఎడమ చేయి రకరకాలుగా చేయడం లాంటివి కొత్తగా అనిపిస్తున్నాయి.


ఇక ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం వల్ల సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. 23 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో సవ్యసాచి రిలీజ్ అవుతుంది. కార్తికేయ, ప్రేమం సినిమాల తర్వాత చందు మొండేటి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


ఇక చైతు కూడా మారుతి డైరక్షన్ లో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కూడా నిరాశ పరచడంతో ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బిజినెస్ బాగానే జరిగినా ఆ బిజినెస్ కు తగినట్టుగా సవ్యసాచి లాభాలు తెచ్చి పెడుతుందో లేదో రాబోయే శుక్రవారం తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: