మీ టూ ఉద్యయం ఇప్పడూ ఇండియా లో తారా స్థాయికి చేరినా, సౌత్ ఇండియా లో మాత్రం అర్జున్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే శృతి హరిహరన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, నిందుతుడు(అర్జున్) మీద వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కబ్బర్ పార్క్ పోలీస్టేషన్లో కంప్లయింట్ బుక్ చేసినట్లు బెంగుళూరు డిప్యూటీ పోలీస్ కమీషనర్ డి.దేవరాజ్ తెలిపారు. శృతి హారిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు కన్నడ సినీ పెద్దలు శృతి హరిహరన్, అర్జన్ మధ్య రాజీకుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

నడుము, తొడలు టచ్ చేస్తూ బ్రా మీదుగా చేతులు

శృతి ఆరోపణలపై అర్జున్ రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో..... శృతి సైతం ఏ మాత్రం తగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.2016లో వచ్చిన ‘విస్మయ' అనే కన్నడ సినిమా షూటింగ్ సమయంలో రిహార్సల్ పేరుతో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తన కంప్లయింటులో పేర్కొన్నారు. దీంతో పాటు 2015 నవంబర్, డిసెంబర్లో జరిగిన మరో రెండు ఇన్సిడెంట్లను సైతం ఆమె ఫర్యాదులో పేర్కొన్నారు.

ప్రైవేట్ ప్లేసులో కలుద్దామన్నాడు

నవంబర్ 2015 లో షూటింగ్ సమయంలో.... రిహార్సల్ పేరుతో అర్జున్ తన అనుమతి లేకుండా దగ్గరకు లాక్కుని.... నడుము, తోడలు, వీపు భాగంలో అసభ్యంగా టచ్ చేశాడని, ఆపై తన బ్రా మీదుగా చేతులను మూవ్ చేస్తూ ఇబ్బంది పెట్టాడని శృతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిహార్సల్ సమయంలో అర్జున్ అలా చేస్తుంటే మౌనంగా భరిస్తూ ఇబ్బంది పడ్డాను. నేను అప్పుడప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాను. ఆయనేమో సీనియర్ యాక్టర్. ఆయన చేసే పనికి అడ్డు తగినా, కంప్లయింట్ చేసినా నా కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని మౌనంగా ఉండియాను అని శృతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: