కాజల్ ఇప్పటివరకు అందరీ పెద్ద హీరోలతో నటించింది . చిరంజేవి నుంచి ఎన్టీఆర్ వరకు అందరితో నటించింది అయితే ఇప్పుడు యువ హీరో సరసన నటించడానికి ఒప్పుకున్నది అంటే ఆమె మార్కెట్ పడిపోయిందని చెప్పాల్సిందే.అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా టాలీవుడ్‌ను ఏలేస్తున్నది. వయసు పెరుగుతున్నప్పటికీ, యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకొంటున్నది. 

కాజల్ ఇంతగా దిగజారిపోయిందా.. అందుకే ఆ హీరో తో  నటిస్తుందా...!

ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటితో నటించి మెప్పించింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం నంబర్‌తో అలరించింది. అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతున్నది. తాజా టాలీవుడ్‌లో ఓ యువ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది. గత పదేళ్ల కెరీర్‌లో 50కు పైగా చిత్రాల్లో నటించింది.


కాజల్ ఇంతగా దిగజారిపోయిందా.. అందుకే ఆ హీరో తో నటిస్తుందా...!

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించే కొత్త చిత్రంలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రం కోసం తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు రూ.1.75 కోట్ల పరితోషికాన్ని తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. టాలీవుడ్ మార్కెట్లో యువ తారలు పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి తారలు అందుబాటులో ఉన్నారు. అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకొంటున్నారు. ఇంకా తక్కువ రెమ్యునరేషన్‌కు కూడా రెడీగా ఉండే వాళ్లు ఉన్నారు. అయితే కాజల్‌కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: