ఇప్పుడు భారత దేశంలో ఎక్కడ చూసినా `మీ టూ` ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అయితే బాలీవుడ్ లో ఆ మద్య తనూశ్రీ దత్తా గత పది సంవత్సరాల క్రితం ప్రముఖ నటులు నానా పటేకర్ లైంగికంగా వేధించారని ఆరోపించారు. అప్పటి నుంచి బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి. తనూశ్రీ దత్తాకు కంగనా రౌనత్ కూడా తోడై ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే..కొంత మందికి లొంగి పోవాల్సిందే..అలా అయితేనే ఛాన్స్ లు ఇస్తారని ఆరోపించారు. గతంలో కూడా తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించింది.
ఇదిలా ఉంటే..ఇప్పడు బాలీవుడ్ లో హీరోయిన్ల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. తనూశ్రీ దత్తా పై హాట్ బ్యూటీ రాఖీ సావంత్ తనుశ్రీ స్వలింగ సంపర్కురాలు. 12 ఏళ్ల క్రితం ఆమె నాపై అత్యాచారానికి పాల్పడింది. ఆమె మాదక ద్రవ్యాలు సేవిస్తుంది. డ్రగ్స్ తీసుకోమని నన్ను కూడా బలవంతపెట్టింది` అంటూ తనుశ్రీపై రాఖీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిపై స్పందించిన తనూశ్రీ దత్తా.. అసత్య ప్రచారాలతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. నేను మాదక ద్రవ్యాలు సేవించను. మద్యం కూడా తీసుకోను. అలాగే నేను స్వలింగ సంపర్కురాలిని కాదు. సమాజంలో మార్పును తీసుకురాగల శక్తి ఉన్న ఉద్యమాన్ని ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలతో పలుచన చేయకూడద`ని తనుశ్రీ పేర్కొంది.