యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సవ్యసాచి’. మైత్రి మూవీస్ బ్యానర్పై చందూ మొండేటి ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే అక్కినేని నాగచైతన్య ఎప్పటి నుంచో మాస్ హీరోగా ట్రై చూస్తునే ఉన్నాడు. కాని అతను మాస్ హీరోగా ప్రయత్నించిన ప్రతిసారి చైతుకు నిరాశే ఎదురైంది. ఏం మాయ చేసావే సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న చైతూ చాలా వరకు యాక్షన్ తరహా సినిమాల్లోనే నటించాడు.
అయితే చైతు నటిచిన లవ్ & ఫ్యామిలీ సినిమాలు హిట్ కావడంతో చైతు మాస్ సినిమాలు కన్నా ఫ్యామిలీ సినిమాలు చేస్తేనే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో మాధవన్ నటన హైలైట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్లా కనిపిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులను కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.
సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ను ఇచ్చారు. ఎక్కువగా కట్స్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ నటించగా.. మాధవన్, భూమిక చావ్లా కీలక పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే పోస్టర్లు, ట్రైలర్తో ఆకట్టుకున్న ఈ సినిమాపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.