మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా నటిస్తుంది. బాలీవుడ్ బాట పట్టిన అమ్మడు కొన్నాళ్లుగా తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా రవితేజ ఇల్లి బేబ్ కు ఛాన్స్ ఇచ్చాడు.


ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా టీజర్ లో శ్రీను వైట్ల డైరక్షన్ టాలెంట్ కనబడింది. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది బలగం కాదు మనలోని బలం అంటూ రవితేజ చెప్పగా.. ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలని విలన్ వాయిస్ చెబుతుంది.


ఇలా సినిమాలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన ట్విస్టులు, ఫైట్స్, లవ్ అండ్ ఎమోషన్ అన్ని కవర్ చేసినట్టుగా ఉంది. అమర్ అక్బర్ ఆంటోనీ కేవలం శ్రీను వైట్లకే కాదు రవితేజకు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సినిమా. రవితేజ మూడు పాత్రల్లో నటిస్తుండగా టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచింది.


మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కాబట్టి సినిమాపై హోప్స్ బాగానే ఉన్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నవంబర్ 16న రిలీజ్ కాబోతుంది. వెంకీ, దుబాయ్ శీను లాంటి హిట్లు కొట్టిన కాంబినేషన్ లో వస్తున్న ఈ ట్రిపుల్ 'A' సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: