సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించబడుతున్న ఈ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా సరే కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో కోట్లకు కోట్లు పెట్టేశారు.


అయితే 2.ఓ సినిమా బడ్జెట్ మీద ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయం వెళ్లబుచ్చుతున్నారు. కోలీవుడ్ మీడియానే ఈ సినిమా బడ్జెట్ కు 550 కోట్ల దాకా వెచ్చించారని అంటున్నారు. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా 2.ఓ అసలు బడ్జెట్ ఎంత అన్నది చెప్పారు. అనుకున్నట్టుగా 500, 600 కోట్లు అసలు కాలేదని తెలుస్తుంది. 


2.ఓ మొత్తం 400 కోట్లలో కంప్లీట్ చేశారట. అయితే అది కూడా వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ కోసం ముందు చేయించిన కంపెనీ మూత పడగా మళ్లీ వాటి కోసం అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. అలా మొత్తంగా 400 కోట్లలో సినిమా పూర్తి చేశారట. ఇప్పుడు పబ్లిసిటీ ఖర్చు కూడా వాటిలోనే అని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ రిలీజ్ ఆస్కారం ఉంది కాబట్టి ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ రికవరీ పెద్ద కష్టమేం కాదు. 


సినిమా బిజినెస్ అయ్యే దాన్ని బట్టి సినిమా ఎంత లాభం తెస్తుంది అన్నది తేలిపోతుంది. అయితే ఇదవరకు రజిని సినిమాలు భారీగా అమ్ముడయ్యి డిస్ట్రిబ్యూటర్స్ ను నష్టాలు పాలయ్యేలా చేశాయి. 2.ఓపై కూడా అంచనాలను బట్టి ఎక్కువ మొత్తం పెట్టినా అది రాబట్టే బాధ్యత మాత్రం రజిని మీదే ఉందని చెప్పొచ్చు. అమీజ్ జాక్సన్ తో పాటుగా అక్షయ్ కుమార్ కూడా 2.ఓలో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: