ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు అమర్ జీత్ సింగ్ మృతి చెందారు. ఈ విషయాన్ని దలేర్ మెహందీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమర్ జీత్సింగ్ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. మికా సింగ్ తన సోదరుడి ఫోటోని ట్విట్టర్లో షేర్ చేస్తూ .. అనారోగ్యంతో కొన్నాళ్ళుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా సోదరుడు మమ్మల్ని విడిచి వెళ్ళారు. మా అందరికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం అని మికా తన ట్వీట్లో తెలిపారు.
ఇక అమర్జీత్ సింగ్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం తిత్లక్ విహార్ గ్రౌండ్లో జరపనున్నట్టు తెలుస్తుంది. దలేర్ మెహందీ 1995లో వచ్చిన బోలో తారర అనే సాంగ్తో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకి పాడిన ఆయన బాహుబలి టైటిల్ ట్రాక్ కూడా పాడారు.
మికా సింగ్ భజరంగీ బాయిజాన్ చిత్రంలో ఆజ్కి పార్టీ అనే సాంగ్తో ఎంతగానో అలరించాడు. చింత త త చిత చిత (రౌడీ రాథోడ్), దినక చిక (రెడీ), మౌజా హి మౌజా( జబ్ వుయ్ మెట్) మరియు టు మెరే అగల్ బజల్ హై( ఫటాపోస్టర్ నికలా హీరో) పాటలు మికా సాంగ్ పాడిన వాటిలో ప్రాముఖ్యమైనవి. దలేర్ మెహందీ, హర్ జీత్ మెహందీ, జోగేందర్ సింగ్ లతో పాటు తనకు ఇది తీరని లోటు అని చెప్పారు.