త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మరోసారి ఎన్.టి.ఆర్ స్టామినా ప్రూవ్ అయ్యేలా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి మల్టీస్టారర్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాలో చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.


అరవింద సమేత తర్వాత త్రివిక్రం ఏ సినిమా చేస్తాడు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రం సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేసి హిట్ అందుకున్నారు. మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అనుకున్నారు.


కాని త్రివిక్రం ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తన తర్వాత సినిమా అంతా కొత్తవాళ్లతో చేస్తునట్టు చెప్పుకొచ్చాడు. త్రివిక్రం సినిమా అనగానే కోట్ల బడ్జెట్, స్టార్ హీరో ఇలాంటి అంచనాలు ఉంటాయి. కాని ఈసారి కొత్తవాళ్లతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రం. అలా చేయడం తనకు కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు.


ఇక తన పేరు ముందు మాటల మాంత్రికుడు అని పెట్టడం తనకు నచ్చలేదని. అలా పిలవడం తనకి ఇష్టం లేదని అలా పిలిచే వారు తన శత్రువులే అంటూ సెన్సేషన్ కామెంట్ చేశాడు త్రివిక్రం. ప్రాసలు, పంచులు స్పాటేనియస్ గా వస్తాయి తప్ప ఓ ఆలోచననే థీం గా చేసుకుని తాను సినిమా చేస్తానని చెప్పాడు త్రివిక్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: