ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితోను సినిమాలు చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎదిగిన మైత్రి మూవీ మేకర్స్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తులుగా చలామణి అవుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వారు తీయబోతున్న 10 సినిమాలు లైన్ లో ఉన్నాయి అని స్వయంగా ఈసంస్థ నిర్మాతలు అధికారికంగా చెప్పారు అంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం వీరి హవా ఏస్థాయిలో కొనసాగుతోందో అర్ధం అవుతుంది. 
Mythri Movie Makers
ఇలాంటి పరిస్థుతులలో ఈసంస్థ నిర్మాతలు నిన్న మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ను బట్టి పవన్ ఎన్నికల తరువాత సినిమాలలోకి రావడం ఖాయం అని అనిపిస్తోంది. గతంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని మైత్రి మూవీస్ సంస్థ కథను రెడీపెట్టి పవన్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం కూడ జరిగింది. 
Pawan Kalyan
అయితే ‘అజ్ఞాతవాసి’ పరాజయంతో మనసు మార్చుకున్న పవన్ రాజకీయాల బాట పట్టడంతో పవన్ తో మైత్రి మూవీస్ సినిమా ఉండదు అని అనుకున్నారు అంతా.  అయితే ఈ విషయాల పై ఈమూవీ నిర్మాతలు క్లారిటీ ఇస్తూ పవన్ తో తాము చేయబోయే సినిమా పై వివాదాలు సృష్టించ వద్దని పవన్ ఎన్నికల తరువాత తమ సంస్థలో మూవీ చేస్తాడని ఆశిస్తున్నామని అంటూ పవన్ అభిమానులకు జోష్ ను కలిగించే వార్తను తెలియచేసారు మైత్రి మూవీస్ నిర్మాతలు. 
Mahesh Babu and Sukumar
ఇదే సందర్భంగా మహేష్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆసినిమాకు సంబంధించి కథ ఇంకా ఫైనల్ కాలేదని కథ కుదిరిన తరువాత వచ్చే ఏడాది మార్చి ప్రాంతంలో తమ సంస్థ మహేష్ తో తీయబోయే సినిమా ఉంటుంది అని లీకులు ఇస్తున్నారు. పవన్ కోసం రెడీ పెట్టిన కథకు మార్పులు చేసి రవితేజాతో సినిమాను రాబోతున్న డిసెంబర్ నుండి మొదలు పెడుతున్నాము అని సంకేతాలు ఇవ్వడమే కాకుండా రితేష్ అనే ఒక యంగ్ డైరెక్టర్ ను పరిచయం చేస్తూ కేవలం 89 లక్షల రూపాయల బడ్జెట్ లో ఒక చిన్న సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన మైత్రి మూవీస్ వ్యూహాలను చూస్తూ ఉంటే రాబోతున్న రోజులలో ఈనిర్మాణ సంస్థ సంచలనాలకు చిరునామాగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: